Vijayawada : లిఫ్ట్ వైర్ తెగి పడి.. ముగ్గురి మృతి

Vijayawada : లిఫ్ట్ వైర్ తెగి పడి.. ముగ్గురి మృతి

ఏపీ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఇబ్రహీంపట్నంలోని విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ ( వీటీపీసీ) కేంద్రంలో.. లిఫ్ట్ లో ఎనిమిది మంది పైకి వెళుతున్నారు. పైకి వెళుతున్న లిఫ్ట్ వైర్ ఒక్కసారిగా తెగిపోవటంతో.. వాయువేగంతో కిందకు పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. లిఫ్ట్ వైర్ తెగిన సమయంలో.. లోపల ఎనిమిది మంది ఉద్యోగులు, సిబ్బంది ఉన్నట్లు సమాచారం. మార్చి 18వ తేదీ శనివారం ఉదయం 10 గంటల సమయంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. విధులకు హాజరైన ఉద్యోగులు, సిబ్బంది.. పై అంతస్తులకు లిఫ్ట్ లో వెళుతున్న సమయంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది.

వీటిపీఎస్ లోకి ఇతరులు ఎవర్నీ అనుమతించటం లేదు. మీడియాను లోపలికి రానివ్వటం లేదు. కేవలం ప్రమాదం వార్తను మాత్రం బయటకు చెబుతోంది యాజమాన్యం. లిఫ్ట్ లోని ఎనిమిది మందిని విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్నారు. గాయపడిన మిగతా ఐదుగురికి తీవ్రగాయాలు అయ్యాయని.. వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు స్పష్టం చేస్తున్నారు ఉన్నతాధికారులు.